Friday, March 14, 2025
spot_img
Homeలోకల్ వార్తలుసింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణ పుష్పార్చన

సింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణ పుష్పార్చన

సింహాచలం,న్యూస్ వన్ ప్రతినిధి :

శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన గురువారం ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చణ అత్యంత వైభవంగా, సింహాచల పుణ్య క్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణపుష్పార్చన, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణపుష్పార్చన, జరిపించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వి .త్రినాధరావు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments