
సింహాచలం,న్యూస్ వన్ ప్రతినిధి :
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనర సింహస్వామి వారి నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ,నూతన యజ్ఞోపవీత సమర్పణ,జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరి పించారు మంత్రపుష్పం,మంగళా శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరము స్వామి వారి అంతరాలయ దర్శనం కల్పించారు.