Thursday, March 13, 2025
spot_img
Homeజాతీయ-వార్తలుపుణెలో జరిగిన లీడర్ షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పుణెలో జరిగిన లీడర్ షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

300 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమంలో ఉత్తమ విధానాలు, సుపరిపాలనపై మేధోమథనం

రాష్ట్ర ప్రభుత్వ నూతన పాలసీలు, 2047 విజన్ లక్ష్యాలను కాంక్లేవ్‌లో వివరించిన ఏపీ నుంచి హాజరైన కుమార్ రాజా

పుణె :

పుణెలో ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన లీడర్ షిప్ కాంక్లేవ్‌లో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ కాంక్లేవ్‌కు దేశం మొత్తం మీద 300 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా ఏపీ నుంచి కుమార్ రాజా హాజరయ్యారు. సుపరిపాలన, పబ్లిక్ పాలసీల రూపకల్పనపై ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలపై చర్చించేందుకు కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కాంక్లేవ్‌లో స్వర్ణాంధ్ర విజన్, పేదరిక నిర్మూలనకు రూపొందించిన పీ4 విధానాలపై ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ మేరకు కాంక్లేవ్ వివరాలను ఎమ్మెల్యే కుమార్ రాజా సోమవారం సీఎంకు చంద్రబాబుకు వివరించారు. కుమార్ రాజాను సీఎం అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments