అమరావతి : ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఇటీవల మొత్తం 17 పేపర్లకు సంబంధించిన నమూనా పరీక్షను అందుబాటులో తీసుకొచ్చిన విద్యాశాఖ అధికారులు.. తాజాగా హాల్టికెట్లను డౌన్లోడ్ కోసం వెబ్సైట్లో ఉంచారు. అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసి హాల్టికెట్లు పొందొచ్చు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 20 నుంచి మే 15వరకు దరఖాస్తులు ఆహ్వానించగా.. అన్ని పోస్టుకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే