విశాఖపట్నం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్టణo పర్యటనలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లను పరిశీలించారు.ఎ.యు. ఇంజనీరింగు కళాశాల మైదానంలో అంతర్జాతీయ యెగా డే సంధర్బంగా విద్యార్థులచే యోగా చేయించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కలెక్టరు హరితేంద్ర ప్రసాద్, పాడేరు కలెక్టరు దినేష్ కుమార్ కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాంగణం ఏర్పాట్లకు సంబంధించి బ్లూప్రింట్ ద్వారా వివరాలను తెలియజేసారు. 28వేల మంది గిరిజన విద్యార్థులు ఎ.యు.ప్రాంగణంలో జరుగుకార్యక్రమంలో పాల్గొంటారని, వారికి కావలసిన ఏర్పాట్లు సిద్దం చేసినట్లు తెలిపారు. ఆర్.కె.బీచ్ ప్రధాన వేదికకు ప్రత్యామ్నాయ వేదికగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రులు పట్టణపరిపాలనశాఖమంత్రి పి.నారాయణ, మహిళా,శిశుసంక్షేమశాఖమంత్రి గుమ్మిడి సంద్యారాణి, ఇతర అదికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.