దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
News Image

న్యూ  ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి మళ్ళీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో సుమారు 1000 కరోనా కేసులు పెరిగాయి.ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరోజులోనే సుమారు 1000 కరోనా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. మే 30వ తేదీన 1,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే తాజాగా ఆ కేసుల సంఖ్య 2,710కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,147 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 494 కేసులు, గుజరాత్లో 223 కేసులు, కర్ణాటక - తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో కొవిడ్ బారిన పడి దాదాపు ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. అయితే వీటిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.