మే 31 నే జిల్లాలో పింఛన్ల పంపిణీ జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
News Image

అనకాపల్లి : జిల్లాలో మే  మాసానికి సంబంధించి ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్లు పంపిణీ సజావుగా జరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఎంపీడీఓ లు మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో మే 31 వ తేదీన శనివారం పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందని, కావున 30వ తేదీ నాటికి డబ్బులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 31 వ తేదీ శనివారం సాయంత్రంలోగా శతశాతం పింఛన్ల పంపిణి పూర్తికావాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు.