కర్రెగుట్టల నుంచి సరిహద్దుకు బలగాలు
News Image

ఛత్తీస్‌గఢ్‌ : ఆపరేషన్‌ సిందూర్‌  ప్రభావం ఆపరేషన్‌ కగార్‌పై పడింది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్‌ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లను హెడ్‌క్వార్టర్స్‌ చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఆదివారం ఉదయం లోపు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ వైపు ఆపరేష్‌ కగార్‌ యథావిధిగా కొనసాగనుంది.