విశాఖపట్నం :పేదవాడికి కూడు, గూడు కల్పించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు నేడు ఆయన చిత్రపటానికి జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్ వర్మ ఇతర అధికారులు, ఉద్యోగులుతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు ఆయన జయంతిని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలములోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత నందమూరి తారక రామారావుదేనని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవవలసిన అవసరం ఉందని అలాగే జీవీఎంసీ అధికారులు నగర ప్రజలకు కల్పించవలిసిన మౌళిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పధకాలను అంధించి నగరాభివృద్ధికి కృషిచేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జీవీఎంసీ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆయన పేద ప్రజల అభ్యుదయానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవ రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ, డిపిఓ ఫణి రామ్,ఇతర అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.