ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన చేసిన హోం మంత్రి అనిత
News Image

విశాఖపట్నం :ఏపీలోని విశాఖపట్నం బీచ్ ఒడ్డున జూన్ 21న యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర హోంమంత్రి అనిత సమీక్షించారు. జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభ్రతబార్జి కలిసి బీచ్ రోడ్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. యోగా డేకు భారీగా ప్రజలు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.