తిరుమలలో భారీ మోసం
News Image

తిరుమల : దర్శన టిక్కెట్లు ఇస్తానని బెంగళూరుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ భక్తులను బురిడీ కొట్టించాడు. 36 మంది భక్తుల దగ్గర నుంచి రూ.1.26 లక్షలు వసూలు చేసి.. నకిలీ టిక్కెట్లు ఇచ్చాడు. నకిలి టిక్కెట్లతో క్యూలైన్లలోకి వెళ్లిన భక్తులకు ఆలయ సిబ్బంది చెక్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాము మోసపోయామని భావించిన భక్తులు సదరు ఏజెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.