తొక్కిసలాట ఘటన..హైకోర్టులో సుమోటోగా విచారణ
News Image

బెంగళూరు   : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్‌ కప్పును ముద్దాడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయోత్సాహం కొన్ని గంటలకే ఆవిరైంది. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట  ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టనుంది.  ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరపనుంది. నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. 50 మందికి పైగా గాయపడ్డారు.  కాగా ఈ తొక్కిసలాట ఘటనపై 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అసహజ మరణాల కింద వాటిని పోలీసులు కేసు నమోదు చేశారు.