మే 19న డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహణ
News Image

విశాఖపట్నం : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం కొరకు చేస్తున్న ఏర్పాట్లలోఎటువంటి లోపాలు లేకుండా సర్వం సిద్ధం చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మయూర్ అశోక్ జివిఎంసి అధికారులను  ఆదేశించారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మే 19వ తేదీన జరుపబోవు డిప్యూటీ మేయర్ ఎన్నిక కు చేపడుతున్న ఏర్పాట్లను, తీసుకుంటున్న జాగ్రత్తల పై అధికారులకు పలు  సూచనలను చేయడమైనదని శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ను  మే 19వ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నిక కు తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు వివరిస్తూ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశమునకు కౌన్సిల్ సభ్యులు , ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11.00 గంటల లోగా తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని, ఇతరులను ఎవరినీ కూడా సమావేశంలోనికి అనుమతించబడరని తెలిపారు. సభ్యులు తమ మొబైల్ ఫోన్ లను ప్లైట్ మోడ్ లో పెట్టుకోవాలని సూచించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన జీవీఎంసీ అధికారిక లైవ్ టెలీకాస్ట్ లింకు అందుబాటులో ఉంచుతామన్నారు . ఎన్నిక సోమవారం  జరుగబోతున్నందున ఆరోజు జీవీఎంసీలో ఫ్రీ వెహికిల్ జోన్ అయినప్పటికీ  సభ్యులు, అధికారుల వాహనాలను భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోనికి అనుమతించడం జరుగునని  ప్రిసైడింగ్ అధికారి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.