ఆరిలోవ : జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ఆదేశాల మేరకు 13వ వార్డు ఆరిలోవ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర కళ్యాణ మండపంలో సచివాలయ సిబ్బంది ఆర్పీలు కూటమి నాయకులతో వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 28 కిలోమీటర్లు విస్తరణలో జరిగే యోగాడే లో మన వార్డ్ కు కేటాయించిన స్థలంలో మన వార్డు ప్రజలను తీసుకెళ్లే బాధ్యత వార్డు సచివాలయ సిబ్బంది ఆర్పీలు కూటమి నాయకులకు ఉందని తెలిపారు .భారత ప్రధాని నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో 5 లక్షల మంది యోగా దినోత్సవం లో పాల్గొనడం జరుగుతుందని, యోగ డే ప్రపంచ రికార్డులో నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పోత్రకొండ ధర్మారావు,యు సి డి సి ఓ అప్పలకొండ, సచివాలయం సిబ్బంది, ఆర్పీలు, వార్డు కార్యదర్శి సురేష్ క్లస్టర్ ఇంచార్జ్ బాలస్వామి,మహిళా అధ్యక్షురాలు రమణి,కూటమి నాయకులు ఒడిసెల శ్రీను, అడ్డూరి వెంకటరమణ, ఆనందరావు ట్రావెల్స్ రాజు, గుంజ శ్రీను,మనీ, లక్ష్మి, పుష్ప, ప్రసాద్, పైడి రాజు, గురుమూర్తి, పీరుబాబు,కూన.రాజు, కృష్ణ, జనసేన నాయకులు ఇబ్ర తదితరులు పాల్గొన్నారు.