సింహాచలం :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ & మైనింగ్ మరియు అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ సహాయకార్యనిర్వహణాధికారి ప్రోటోకాల్ ఏఈఓ ఎన్. అనందకుమార్. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు ప్రోటోకాల్ పర్యవేక్షణాధికారి పద్మనాభ రాజు సీనియర్ సహాయకులు సూర్యనారాయణ వేద పండితులు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్ప స్తంభము ఆలింగనం చేసుకున్నారు. ఆ తదుపరి నాదస్వరలతో వేదమంత్రాలతో బేడా మండపము ప్రదక్షిణ కావించి స్వామివారి అంతరాలయ దర్శనం అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనము ఇచ్చి ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను బహుకరించారు.