సీల్డ్ కవర్ లో డిప్యూటీ మేయర్ పేరు!
News Image

(వేదుల శ్రీనివాస్ వరప్రసాద్ యాదవ్ )


మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి సీల్డ్ కవర్ సంస్కృతిని అమలు చేయనున్నారు. డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం టిడిపి,జనసేన మధ్య గట్టి పోటీ నెలకొనడంతో రెండు పార్టీల అధినేతల సూచన మేరకు అభ్యర్థి పేరును సీల్డ్ కవర్ లో విశాఖకు పంపనున్నారు.డిప్యూటీ మేయర్ గా ఎవరిని ఎంపిక చేయాలన్నది విశాఖలోనే తేల్చుకోవాలని ఎమ్మెల్యేలకు,మేయర్ కు మూడు రోజుల క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..అయినప్పటికీ జనసేన పార్టీ గట్టిగా పట్టు బట్టడంతో ఎంపిక అనేది తేలిక గా అయ్యే పని కాదని టిడిపి నేతలకు అర్థమయింది. డీసీసీబీ చైర్మన్ పదవిని జనసేనకు చెందిన కోన తాతారావుకు కేటాయి కేటాయించడంతో డిప్యూటీ మేయర్-1 పదవిని టిడిపి తీసుకోవాలని ఎమ్మెల్యేలు యోచిస్తున్నారు..అవసరమైతే డిప్యూటీ మేయర్-2 పోస్ట్ ను జనసేన కు కేటాయించేలా ఆ పార్టీ నేతలను ఒప్పించాలని భావిస్తున్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదంతో టిడిపి నుంచి ఒక పేరు ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు...ఈ నేపథ్యంలో టిడిపి నుంచి కార్పొరేటర్ లు గొలగాని మంగవేణి, మెుల్లి హేమలత, గంధం శ్రీనివాసరావు,పల్లా శ్రీనివాసరావు(చిరంజీవి) , పేర్లతో కూడిన జాబితాను జాబితాను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి అందజేయనన్నారు. యాదవ్ సామాజిక వర్గం చెందిన మేయర్ పీఠం నుంచి గొల గాని హరి వెంకట కుమారి పై అవిశ్వాసం పెట్టి ఆమె స్థానంలో పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.. అందువల్ల డిప్యూటీ మేయర్ పోస్ట్ ను యాదవ సామాజివర్గానికి మహిళనే ఎంపిక చేయాలని పలువురు పట్టుబడుతున్న..నగరంలో మరొక బలమైన సామాజిక వర్గమైన కాపుల నుంచి ఒకరికి ఇచ్చి తీరాలనే వాదన బలంగా ఉంది.. కాగా ఈనెల 19న డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్నది.ఈ క్రమంలో 18 వ తేదీన ఎమ్మెల్యేలు ,టిడిపి,జనసేన కార్పొరేటర్లు నగరంలో భేటీ కానున్నారు..ఎన్నిక సమయం కంటే ముందుగానే అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ రావడం ఖాయమని కీలక నేత స్పష్టం చేశారు.