రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈలు) నిర్లక్ష్యం
News Image

---- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ 


తణుకు: ఒక దేశ సర్వతోముఖాభి వృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈలు) ఎంతో ఉపయోగకరం. ఐక్యరాజ్య సమితి 2017 ఏప్రిల్ 6న 74వ ప్లీనరీలో... అభివృద్ధి చెందుతున్న దేశంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఎమ్ఎస్ఎమ్ఈల జాతీయ సామర్థ్యాలను ఆయా దేశాలు అనుగుణంగా అభివృద్ధి చేయడం కోసం జూన్ 27వ తారీకున ఎమ్ఎస్ఎమ్ఈల డేగా ప్రకటించడం ప్రాముఖ్యం సంతరించుకున్నది.   

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు, మా తండ్రి గారైన స్వర్గీయ బి.వి.రామారావు గారి ఆశయం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తణుకులో గురువారం ఉదయం చిట్టూరి హెరిటేజ్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈలు) వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సరే ఎవరు ముందుకు రాకపోవడం అధికారులు నిర్లక్ష్యం పై రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్ఎస్ఎమ్ఈల మరింత అభివృద్ధి చేయడానికి నిపుణులు నుండి సలహాలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ప్రతి ఒక ఇంట్లోని పారిశ్రామిక వేత్త తయారు చేయాలని, గడిచిన సంవత్సరం కాలంలో ఔత్సాహిక పారిశ్రామితులు ఏ జిల్లాలో ఎంత మంది ముందుకు వచ్చారు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రకటించాలని రామ్ డిమాండ్ చేశారు.

 5000 కోట్లు ఆదయం రాష్ట్రానికి వస్తుంది వన్ టైం సెటిల్మెంట్ కింద 

2017 జీఎస్టీ ఏర్పాటయింది అంతకుముందు ఉన్న వ్యాట్ ఆదాయం కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది. ఆ నిధులు రాబట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వల్ల అలాగే ఉండిపోయింది. వడ్డీలు, పెనాల్టీలు తగ్గించి వన్ టైం సెటిల్మెంట్ కింద ని తీసుకుంటే 5000 కోట్లు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఈ విధంగా వ్యాట్ నిధులను రాబట్టుకున్నారు. మన రాష్ట్రం 5000 కోట్ల వదులుకొంది. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా, పెనాల్టీ రద్దు చేస్తే 5000 కోట్ల వస్తుంది.

వనరులు ఉన్నప్పటికీ అధికారుల కృషి లోపం వల్ల వెనుకబడిపోతున్నాము 

పత్తి పంట గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి లో పండుతుంది. రాష్ట్ర లో స్పిన్నింగ్ మిల్స్ తక్కువ ఉన్నాయి. దారం తయారు చేసి పక్క రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నారు. 26 జిల్లాలు లో కూడా స్పిన్నింగ్ మిల్స్ ప్రారంభిస్తే 26 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. కాటన్ ప్రోడక్ట్ తయారవుతుంది. గుజరాత్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ముంబై కి రా మెటీరియల్ ఎక్కువ వెళ్లిపోతుంది. యువత రెండు లక్షలు సంపాదించే అవకాశం ఉంది. మనకు వనరులు ఉన్నప్పటికీ అధికారుల కృషి లోపం వల్ల వెనుకబడిపోతున్నాము. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలి. చిన్న ఎంటర్ప్రైజ్లను అభివృద్ధి కోసం అధికారులు దృష్టి పెట్టాలి. అధికారులు దృష్టి సారిస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు, కాబట్టి అధికారులు కూడా సహకరించాలి.

జులై 28న ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పేరు మీద అవార్డులు ఇవ్వాలి 

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పేరు మీద ప్రతి సంవత్సరం జులై 28న   అవార్డులు ఇవ్వాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్   అన్నారు. జులై 28న ఆయన జన్మించిన తేదీ అని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు.  దేశానికి స్వతంత్రము రావడానికి నాలుగు రోజులు ముందు (11-08-1947) తణుకులో ఆంధ్ర షుగర్స్ ని స్థాపించారు. అప్పట్లో జనసంచారం లేని ఆ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఎన్నుకోవడం ఒక సాహసం. మొదట్లో రోజుకి 600 టన్నులు క్రషింగ్ సామర్ధ్యంతో స్థాపించిన కర్మాగారం అంచెలంచెలుగా ఎదిగి 6000 టన్నులకు చేరేలా కృషి చేశారు. 350 మంది ప్రారంభించిన ఆంధ్ర షుగర్స్ నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పథంలో మరింత సాగుతుంది.1984 లో తణుకులోనే రాకెట్ ఇంధనం ప్లాంట్ ని అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ చేతుల మీదుగా ప్రారంభింప చేసి పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లారు. 24 ఏళ్ళు వయసులోనే ఆంధ్రా షుగర్స్ స్థాపించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కు ఆయన జీవితం ఆదర్శం కావాలని, ఆయన స్ఫూర్తితో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలని రామ్ పిలుపునిచ్చారు.