విశాఖపట్నం : "న్యూస్ వన్" తెలుగు దినపత్రికలో ఇప్పటి వరకు పనిచేసిన ఎన్టిఆర్ జిల్లా ,మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలో రిపోర్టర్ గా పని చేసిన ఎం.శ్రీనివాస్ రావు వివిధ ప్రకటనలు వేసి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నుండి డబ్బులు వసూళ్లు చేసి వాటిని ఆఫీస్ కి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాకుండా పత్రిక కార్యాలయం నుంచి ఫోన్ చేసిన అడిగిన జవాబు ఇవ్వడం లేదు.ఈయన "న్యూస్ వన్" పేరు చెప్పి పలు చోట్ల అక్రమ వసూళ్ళు.బెదిరింపులుకు పాల్పడుతున్నటు ఆఫీస్ కి సమాచారం రావడంతో ఆయనను ఉన్నఫళంగా తొలగించడం జరిగింది.శ్రీనివాస్ రావు "న్యూస్ వన్' పేరు చెప్పి డబ్బులు తీస్కుంటునందుకు ఆయన పై ముందస్తుగా పోలీస్ కేసు పెట్టడం జరుగుతుంది.న్యూస్ వన్ పేరుతో ఎక్కడైనా డబ్బులు వసూళ్లు చేస్తే మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదని పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. తదుపరి ఆయన పై చట్టపరమైన చర్యలకు యాజ మాన్యంసిద్ధపడుతోంది. ఈ విషయాన్ని మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం ప్రాంత వాసులతో పాటు ఎన్టీఆర్ జిల్లా వాసులు గుర్తించాలని కోరుతున్నాము.