చండీగఢ్ : పాకిస్థాన్ నుంచి భారత్లోకి మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 85 కేజీల డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. అమృత్సర్కు చెందిన అమర్జోత్ సింగ్ జోతా సంధును ఇందులో ప్రధాన నిందితుడిగా గుర్తించి, అరెస్టు చేశామన్నారు. ఈ పాక్ స్మగ్లింగ్ ముఠాను యూకే నుంచి లల్లీ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని తెలిపారు.ఈ మొత్తం వ్యవహారంలో అమర్జోత్ నివాసం డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారిందని పోలీసులు వెల్లడించారు. పాక్ నుంచి వచ్చిన మాదక ద్రవ్యాలను అతడే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడని తెలిపారు. పాక్లోని ఐఎస్ఐ ఏజెంట్లతోనూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు