ఆరిలోవ : ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్బంగా, విశాఖ తూర్పు,12వ వార్డు, నెహ్రు నగర్ వద్ద నుండిసానిటరీ ఇన్స్పెక్టర్,రామారావు, సచివాలయం హెల్త్ సెక్రటరీలు ఆధ్వర్యంలో, ప్లాస్టిక్ వాడకం వలన కలిగేఅనర్దాలను స్థానికులకు వివరిస్తూ ర్యాలీ చేసిరి ఈ ర్యాలీ లో, ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు, ప్లాస్టిక్ వాడకం ప్రణాంతకం అనే నినాదలు చేస్తూ కాలానిలో అన్నివిధులు ర్యాలీ చేసిరి ఈసందర్బంగా వార్డుటీడీపీ అధ్యక్షులు గాడి సత్యం మాట్లాడుచు ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరు, సింగల్ యుజ్ ప్లాస్టిక్ సంచులు వాడవద్దని వాడిపారావేసిన ప్లాస్టిక్ సంచులు పశువులు ఇతర జంతువులు తిని మరణిస్తున్నాయనియు అలాగే భూమిలో ఎన్ని సంవత్సరాలు కలవవనీయు దీనినుండి వెలువడిన రసాయణాలు బుగర్భ జలాలు లో కలసి మనం త్రాగే నీటిలో కలసి కాన్సర్ ఇతర ఆరోగ్య సమస్యలు వస్తుంటేన్నాయనీయు అందువల్ల ఈ పర్యావరణ దినోత్సవం రోజున ప్లాస్టిక్ వాడమనియు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చ ధనం పరిశుభ్రత పాటిస్తామనీయు ప్రతిజ్ఞ చేయాలి అనీయు కోరిరి ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయం సెక్రటరీలు,శ్రీకాంత్, సాయి, అప్పారావు, అబ్దుల్, యాసిన్, సానిటరీ మేస్త్రి, గణేష్, నాయకులు శ్రీ రెడ్డి అప్పారావు, పైడి మల్లేశ్వరరావు, శ్రీను,కాలనీ మహిళలు పాల్గన్నారు,