పాడేరు : పెండింగ్ పరిహారం చెల్లింపులకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి రెవెన్యూ, టూరిజం, జాతీయ రహదారి అధారిటీ అధికారులతో జాతీయ రహదారి నిర్మాణం, పరిహారం చెల్లింపులుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్న రహదారులు, తాగునీటి పథకాలు, నీటి పారుదల వనరుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పరిహారం చెల్లింపులలో లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ప్రాధాన్యతా పరంగా చెల్లింపులు చేయాలని స్పష్టం చేసారు. పాడేరు లగిశపల్లి, పాడేరు కొయ్యూరు జాతీయ రహదారి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగితెలుసు కున్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జాతీయ రహదారి అధికారులు గుల్షన్ కుమార్, రవి శేఖర్, తాహశీల్దారులు తదితరులు పాల్గన్నారు