అమ్ముడుపోతున్న అక్షరం !
News Image

( న్యూస్ వన్ బ్యూరో )


ప్రజాస్వామానికి నాలుగో స్తంభంగా చెప్పుకుంటున్న ‘మీడియా’ రోజు రోజు కు  విలువలు కోల్పోతున్నది. జర్నలిజం  అనే  అక్షరన్నీ  అమ్ముకుంటున్నారు ... రాత గాడైనా  .. మైక్ పెట్టె  వాడైనా ...అమ్ముడు పోవాల్సిందే అన్నట్టుగా ఉన్నది ప్రస్తుత సమాజంలో..  రాజకీయ నాయకులు విసిరే కుక్క బిస్క్యూట్లకు దాసోహం అవుతుందా..? అంటే అవును అనే సమాధానం వస్తోంది. ప్యాకేజీల వేట పడి అటు యాజమాన్యాలు, ఇటు పనిచేసే జర్నలిస్టులు తమ వృత్తి ‘విలువల.. వలువలు విప్పేసుకుని’ నాయుకులకు రెడ్ కార్పెట్ పేర్చి మరి  వారికి దాసోహమై నిత్యం వార్తలను వండి వారుస్తూ వారి చల్లని నీడలో తరిస్తున్న దుస్థితి నెలకొన్నదని చెప్పక తప్పదు.వాస్తవానికి మీడియా ప్రపంచానికి అద్దం లాంటిది. ఇందులో పనిచేసే వారు నిజాలు, వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైత్యం చేసేందుకు ముందుండాలి. ముఖ్యంగా ఇటు ప్రజలకు ..అటు ప్రభుత్వాలకు వారిదిగా నిలవాలి . అలాంటి మీడియాను, జర్నలిస్టులను ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. కానీ, అలాంటి మీడియా ఎక్కడైనా ఉందా..? అలాంటి జర్నలిస్టులను ఎవరైనా ఉన్నారా..? అనే ప్రశ్నలకు ప్రస్తుత రోజుల్లో  జవాబు దొరకడం కష్ట సాధ్యమేనాని చెప్పాలి.‘ప్రస్తుతం అసలు జర్నలిస్టు ఎవరో.. కొసరు జర్నలిస్టు ఎవరో తెలియడంలేదు. ఎవరుపడితే వాళ్లు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు.మైక్ ,కెమెరా కనబడగానే ఎవడు ..  ఏదిపడితే అది వాళ్ళు మర్చి  ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.రాజకీయ విద్వేషాలకు న్యూస్  చానెల్స్ వేదికగా మార్చేశారు..అందులోను తెలుగు మీడియా ఎవ‌రి అవ‌స‌రం లేకుండానే త‌న‌కు తానుగా శ‌ర‌వేగంగా ప‌త‌న‌మ‌వుతోంది. ఇటీవ‌ల ప‌రిణామాల్ని గ‌మ‌నిస్తే, దాదాపు ప‌త‌నం అంచున నిలిచిన‌ట్టు క‌నిపిస్తోంది. మీడియా అంటే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించేద‌నే న‌మ్మ‌కం ప్ర‌జానీకంలో వుండేది. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని మీడియా యాజ‌మాన్యాలు కొన్ని రాజ‌కీయ పార్టీల‌కు తాక‌ట్టు పెట్టాయి. ప్ర‌స్తుత మీడియా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల అనుబంధ సంస్థ‌లుగా విడిపోయింది.తాజాగా ఇటీవల జరిగిన ఉదంతమే ఇందుకు తార్కణం సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రీ శ్రీనివాసరావు మోడరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణంరాజు అమరావతి మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో  సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి  మంగళవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు  గుంటూరు జైలు కు తరలించారు.తెలుగు మీడియా హద్దులు దాటి మరి ఒకరి పై ఒకరు బురద చల్లుకుంటూ తీవ్ర విద్వేషాలను రెచ్చెస్గొడ్తున్నాయి.



“స‌హ‌జంగా ప‌త్రిక ప్ర‌చుర‌ణ అయిన త‌ర్వాత అమ్ముడుపోతుంది. కానీ ప్ర‌స్తుతం ప‌త్రిక అమ్ముడుపోయిన త‌ర్వాతే , ప్ర‌చుర‌ణ‌కు నోచుకుంటోంది” అనే వ్యంగ్య కామెంట్‌లో ఎంత లోతు వుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక వ‌ర్గం మీడియా, ఇంకో పార్టీ అనుబంధ మీడియా లేకుండా పోవాల‌ని కోరుకుంటూ, బ్యాన‌ర్ క‌థ‌నాల్ని ప్ర‌చురిస్తున్నారంటే, మీడియా ఎంతగా విభ‌జ‌న‌కు గురైందో అర్థం చేసుకోవ‌చ్చు.ఇలాంటి ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు త‌మ కోసం ప‌ని చేస్తాయ‌నే భ్ర‌మ‌ను పోగొట్టిన ఘ‌న‌త కూడా ఈ మీడియా సంస్థ‌ల‌కే ద‌క్కుతుంది. తాము ఆరాధించే రాజ‌కీయ పార్టీల‌కు న‌ష్టం క‌లుగుతుందంటే, ఎంత‌టి ప్ర‌జా వ్య‌తిరేక అంశాన్నైనా దాచి పెట్ట‌డానికి తెలుగు ప్ర‌ధాన ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు వెనుకాడ‌వు. ఈ ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు ప్ర‌సారం చేసే వార్త‌ల‌పై వారికే పట్టు లేదు.వాస్తవాలను పక్కదారి పట్టించి ..అవాస్తవాలను కంటికి కనిపించేటట్టు చేయటంలో తెలుగు మీడియా మంచి దిట్టగా మారిపోయింది.ఒక్క క్రికెట్ స్కోర్ తప్ప మిగిలిన వార్త‌ల్లో ఏ ఒక్క‌, ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ప్ర‌సారం చేసే వార్త‌ల్లో గాని,ప్రచురించే వర్తుల్లోగాని దమ్ము లేకుండా పోయింది.ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రభుత్వాలే వారి పరిపాలనను పొగుడుకునేందుకు అంతా బ్రహ్మాండంగా జరుగుతుందని నమ్మబలికేందుకు, వచ్చే రోజులన్నీ అభివృద్ధికి తార్కాణాలుగా అభివర్ణిస్తూ ఎవరి బాకా వారు ఊదుకుంటున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇరువురూ ఈ సొంత బాకాను ఊదుకోవడంలో పోటీపడుతూ అసలు నిజాన్ని పక్కదోవపట్టిస్తూ ప్రజల్ని వెర్రి వారిని చేస్తున్నారు. ఈ ప్రసారమాధ్యమాల తోడులేని వారి సామాజిక సేవ, చైతన్య దృక్పథం పూర్తిస్థాయిలో ప్రజలలోకి వెళ్లడానికి అవకాశాలు ఉండడం లేదు. కొన్ని సాంఘిక ప్రసారమాధ్యమాల వల్ల తెలియపరుచుకునే అవకాశం కలిగినా అది జనంలోకి చేరేందుకు సమయం పడుతుంది. ఫలితాలు ఆశించినంతగా ఉండడం లేదు.ఇప్పటికైనా మనదేశ వార్తాప్రసార మాధ్యమాలు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకోకపోతే.. పూర్తిగా నిర్వీర్యమైపోయిన సమాజంలో వారి ప్రచారాలు, ప్రయాసను ఎవరూ గుర్తించలేరు. మేలుకోకపోతే ముప్పుతప్పదు. గతం చెబుతున్న చరిత్రల అవేశాన్ని నింపుకుని సమాజంకోసం బలమైన వేదికగా ఈ మాధ్యమాలు నిలబడాలి. ప్రజలకోసం తామున్నామని అన్యాయంపై కలబడాలి అని ఆశిద్దాం