అరకులోయ మే 8. (న్యూస్ వన్ ప్రతినిధి) ఆదివాసి గిరిజన సంఘం అరకు వేలి మండల అధ్యక్షుడు గెమ్మెల చిన్నబాబు, కార్యదర్శి గత్తుం బుజ్జిబాబు సుంకరమెట్ట పంచాయతీ సంగం వలస గ్రామంలో గురువారం పర్యటన చేయడం జరిగిందని పీఎం జన్మన్ ఇల్లు నిర్మాణాలను పరిశీలించడం జరిగిందని లబ్ధిదారులకు మొదటి దశ బిల్లులతో లింటల్ లెవెల్ వరకు నిర్మాణాలు చేసి లింటల్ లెవెల్ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని, హౌసింగ్ అధికారులు లింటల్ లెవెల్ ఫొటోస్ తీసి నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని, గిరిజన ప్రాంతంలో వర్ష కాలం వ్యవసాయ పనులు ప్రారంభం కాకా ముందే ఇల్లు నిర్మాణాలు చేసిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించి ఇల్లు నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయడానికి హౌసింగ్ అధికారులు ఆయన్నారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ హౌసింగ్ 2026 సంవత్సరం మొదటి లోపే
పూర్తి చేయాలంటు పీఎం ప్రకటిస్తూ ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తున్న లబ్ధిదారులకు బిల్లు లు చెల్లించక పోతే ఎలా నిర్మాణాలు పూర్తి అవుతాయి. ఆయన హౌసింగ్ అధికారులకు ప్రశ్నిస్తున్నారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా పీఎం జన్మన్ లబ్ధిదారులు లింటల్ లెవెల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసి బిల్లుల కోసం హౌసింగ్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్ లేదని కారణాలు చూపుతూ కాలక్షేపం చేస్తే ప్రభుత్వం అనుకున్న సమయనికి ఇల్లులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. పీఎం జన్మన్ ద్వారా ప్రతి పీవీటిజి కుటుంబానికి సొంత ఇంటి కళా నెరవేరుతుంది.అని గొప్పలు చెప్పే ప్రభుత్వం ఇల్లు నిర్మాణాలు చేసిన లబ్ధిదారులకు ఇల్లు బిల్లులు జాప్యం చేస్తే ఎలా పేద ఆదివాసీలు ఇల్లు నిర్మించుకోగలరు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పీఎం జన్మన్ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు టి. జోషి గ్రామస్తులు పాల్గొన్నారు.