భారత్ లో దేశ ద్రోహులు
News Image

( క్రైమ్ బ్యూరో )   :  భారత్ న‌ట్టింట్లో న‌క్కిన దేశ ద్రోహుల...ఇండియాలో ఉంటూ, ఇక్క‌డి తిండి తింటూ తిన్న ఇంటి వాసాలు లెక్కపెడ్తూ ....పరాయి  శ‌త్రు దేశం కోసం ప‌ని చేస్తు.... భారత్ పై కాల  నాగులు వలే విషం చిమ్ముతూ భారత్ లో ఉన్న సమాచారాలను ఐఎస్ఐ లుకు చేరవేస్తూన్న దేశ ద్రోహులను ఆట కట్టించే పనిలో  భారత్ ఇంటిలిజెన్సీ ఉంది.పహల్గామ్  టెర్రర్ అటాక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేసే ప్రక్రియను స్పీడప్ పెంచింది. ఇందులో భాగంగా భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు సహకరించిన వారిని అరెస్ట్ చేస్తోంది. పాకిస్థాన్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఏజెంట్ లను వరుసగా గుర్తించే పనిలో పడ్డారు.గూఢచర్య కార్యకలాపాలకు పాల్ప‌డుతున్న వారి ఆట క‌ట్టిస్తున్నాయి. పాకిస్తాన్  తరపున గూఢచర్యం చేస్తున్న ఎనిమిది మందిని ఇప్ప‌టికే అరెస్టు చేశారు. ఇందులో నలుగురు హర్యానాకు చెందిన వారు కాగా, ముగ్గురు పంజాబ్‌, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. సున్నిత స‌మాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న ఆ ఎనిమిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. భార‌తీయుల‌ను సొంత దేశంపైకి ఎగ‌దోసేలా పాకిస్తాన్ కుట్ర‌లు ప‌న్నింది. అందులో భాగంగానే సోష‌ల్ ఇన్‌ఫ్లెయెర్స్‌పై పాక్ ఐఎస్ఐ దృష్టి పెట్టింది. యూట్య‌బ్ వ్లాగ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణగా తెలుస్తోంది.సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఏజెంట్‎గా పని చేస్తోందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు శనివారం (మే 17) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  పాకిస్తాన్ కు ఏజెంట్ గా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో లేటెస్ట్ గా రాంపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను  ఉత్తరప్రదేశ్  స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్న ఎనిమిది మందిని ఇప్ప‌టికే అరెస్టు చేశారు. ఇందులో నలుగురు హర్యానాకు చెందిన వారు కాగా, ముగ్గురు పంజాబ్‌, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. సున్నిత స‌మాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న ఆ ఎనిమిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. భార‌తీయుల‌ను సొంత దేశంపైకి ఎగ‌దోసేలా పాకిస్తాన్ కుట్ర‌లు ప‌న్నింది. అందులో భాగంగానే సోష‌ల్ ఇన్‌ఫ్లెయెర్స్‌పై పాక్ ఐఎస్ఐ దృష్టి పెట్టింది. యూట్య‌బ్ వ్లాగ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణగా తెలుస్తోంది.‘ట్రావెల్ విత్ JO’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా  హర్యానాలోని హిసార్ వాసి. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకున్నందుకు ఆమెను గత వారం అరెస్టు చేశారు. 33 ఏళ్ల జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో నేరుగా సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు గుర్తించారు. అలాగే, రెండుసార్లు పాకిస్తాన్‌ను సందర్శించిందని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నిఘా అధికారులు ఆమెను భారతదేశంలో తమ అసెట్‌గా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గూఢ‌చ‌ర్య ఆరోప‌ణ‌ల‌తో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. జ్యోతి నుంచి కీల‌క స‌మాచారం సేకరించిన‌ట్లు తెలిసింది.



25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ పాటియాలాలోని ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ విద్యార్థి. మే 12న, ఫేస్‌బుక్‌లో పిస్టల్, తుపాకుల ఫోటోలను అప్‌లోడ్ చేసినందుకు హర్యానాలోని కైతాల్‌లో అతన్ని అరెస్టు చేశారు. గత నవంబర్‌లో అతను పాకిస్తాన్‌ను సందర్శించాడని గుర్తించారు. పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడని విచారణలో బయటపడింది.హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే 24 ఏళ్ల నౌమాన్ ఇలాహిని కొన్ని రోజుల క్రితం పానిపట్ లో అరెస్టు చేశారు. అతను పాకిస్తాన్‌లోని ISI హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇస్లామాబాద్‌కు సమాచారం ఇవ్వ‌డానికి తన బావమరిది ఖాతా ద్వారా పాకిస్తాన్ నుంచి డబ్బును స్వీకరించాడ‌ని విచార‌ణ‌లో వెలుగు చూసింది.ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా మే 16న హర్యానాలోని నుహ్‌లో అర్మాన్ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అతను పాకిస్తాన్‌కు సున్నితమైన సమాచారాన్ని తరలిస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఈ మేర‌కు కీల‌క ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని, నిందితుడి నుంచి మరిన్ని వివ‌రాలు సేక‌రించేందుకు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ను ఆదివారం మొరాదాబాద్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్  అరెస్టు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అతను పాక్ నిర్వాహకులకు అందజేశాడని ఎస్‌టీఎఫ్ తెలిపింది. అతను అనేకసార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన‌ట్లు గుర్తించారు. సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో సున్నిత‌మైన స‌మాచారాన్ని పాక్‌కు చేర‌వేశాడ‌ని పోలీసులు తెలిపారు.జలంధర్‌లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మొహమ్మద్ ముర్తజా అలీని అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడని నిఘా వర్గాలు గుర్తించి స్థానిక పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. దీంతో అత‌న్ని అరెస్టు చేశారు. తాను స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా దేశానికి చెందిన కీల‌క స‌మాచారాన్ని ఐఎస్ఐకి చేర‌వేస్తున్న‌డాని గుర్తించారు. అతని వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. గజాలా, యామిన్ మొహమ్మద్‌ను ఇలాంటి గూఢ‌చ‌ర్య ఆరోపణలపై పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.ఇండియాలో పుట్టి, పెరిగి పాకిస్తాన్ కోసం ప‌ని చేస్తున్న స్వదేశీ దొంగ‌ల‌ను గుర్తించ‌డంలో నిఘా వ‌ర్గాలు నిమ‌గ్న‌మ‌య్యాయి. ఇలాంటి వారి కోసం ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత మ‌రింత తీవ్ర శోధ‌న ప్రారంభ‌మైంది. యూట్యూబ‌ర్ ముసుగులో, వ్యాపారి ముసుగులో పాకిస్తాన్‌కు వెళ్తూ సున్నిత స‌మాచారాన్ని చేర‌వేస్తున్న వారిని క‌ట‌క‌టాల్లోకి పంపేందుకు నిఘా వ‌ర్గాలు, భ‌ద్ర‌తా ద‌ళాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి.