Thursday, March 13, 2025
spot_img
Homeఆంధ్రప్రదేశ్ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ స్థానానికి నలుగు కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు

ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ స్థానానికి నలుగు కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు

అమరావతి,న్యూస్ వన్ ప్రతినిధి (మార్చి 10) :

ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల కోటాలో ప్రకటించబడిన ఐదు శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికకు కూటమికి చెందిన నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. టీడిపీ, జనసేన, బీజెపి కూటమి లోని జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, టీడిపీ కి చెందిన ముగ్గురు అభ్యర్థులు మరియు బీజెపీ కి చెందిన ఒక అభ్యర్థి నేడు నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం ఐదు స్థానాలకు ఐదురుగు కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. తొలుత టీడిపీ కి చెందిన ముగ్గురు అభ్యర్థులు వరుసగా బీద రవిచంద్ర, బి.టి.నాయుడు, కావలి గ్రీష్మ తమ నామినేషన్లను దాఖలు చేయగా తుదుపరి బీజెపీ కి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. తదుపరి ఈ నలుగురు అభ్యర్థులు తమ రెండో సెట్టు నామినేష్ పత్రాలను కూడా దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర శాసన సభ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్. వనితా రాణికి వరుసగా తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణి ఆయా నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన పిదప భారత సంవిధానపు 173 (ఎ) పరచ్చేదము ప్రకారం ఒక్కొక్కరిచే ప్రతిజ్ఞ చేయించారు.ఎం.ఎల్.సి. అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీద రవిచంద్రతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన సభ్యులు పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన బి.టి.నాయుడు తోపాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు హాజరు కాగా, మరో అభ్యర్థి కావలి గ్రీష్మతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, శాసన సభ్యులు కె.లలిత కుమారి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పి. అనురాధ హాజరయ్యారు. కూటమిలోని బీజెపీకి చెందిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు.సహాయ రిటర్నింగ్ అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సహాయ కార్యదర్శులు ఆర్. శ్రీనివాసరావు మరియు ఎం. ఈశ్వరరావు నామినేషన్ తదితర పత్రాల పరిశీనలో రిటర్నింగ్ అధికారి సహకరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments