
ముంబయి,
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పాడి పశువుల చర్మ సంరక్షణకు రూపొందించిన లంపీస్కీన్ డిసీజ్కి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనిపెట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని మల్లూరులో లంపీస్కీన్ డిసీజ్ నివారణకు రూపొందించిన దివా మార్కర్ వ్యాక్సిన్ కు సోమవారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(CDSCO) ఆమోదం లభించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మొట్టమొదటి వ్యాక్సిన్ అని భారత్ బయోటెక్ పేర్కొంది.