news Breaking News
clock
జన్యు మార్పిడి పంటలు అవసరమా..?

జన్యు మార్పిడి పంటలు అవసరమా..?

Print News

పాలకొండ : జన్యు మార్పిడి పంటలు వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తాయని వాటిని అడ్డుకోవాలని పర్యావరణ నిపుణులు వందనా ప్రచారం చేశారు. ఇప్పటికే జన్యు మార్పిడి వంగ, బంగాళదుంప, కొన్ని కాయగూరలపై జన్యుమార్పిడి చేసి పంటించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగాని, విమానాశ్రమాలకు, గ్రీన్‌ ఎనర్జీలకు, పారిశ్రామిక వాడలకు గృహావసరాలకు భూమి వినియోగం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో జన్యు మార్పిడి ప్రవేశపెట్టారు. ఒక వైపు ప్రకృతి వ్యవసాయానికి నిధులు సమీకరణ మౌళిక వనతులు కల్పనకు, విస్తరణ పరిశోధనా  సాంకేతిక సహకారం అందించడానికి అమెరికాకు చెందిన పెగాసన్‌కేపిటల్‌ అడ్వజర్లు రైతు సాధికారిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం వల్ల ప్రకృతి వ్యవసాయాన్ని 10 లక్షల ఎకరాల నుంచి 60 లక్షల ఎకరాలకు విస్తరింపజేయడం దీని సంకల్పం. మానవ ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూసే ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని పెగాసన్‌ కేపిటల్‌ అడ్వజర్‌ సీఈఓ క్రేగ్‌కాగొట్‌ ప్రాడ్యూసర్‌ సీఈఓ కిల్‌ అగొడా, సలహాదారుడి జాన్‌ మెకనార్ట్‌ తెలుపుతుంటే కేంద్రం కార్పొరేట్‌ లాబీల ఒత్తిడి తో జన్యు మార్పిడిని కేంద్రం ప్రొత్సహిస్తుంది. రెండు వరి రకాలను విడుదల చేసిందని జిఎంప్రీ ఇండియా కాలిషన్‌ విమర్శించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ భారత వ్యవసాయ పరిశోధనా మండలి అభివృద్ధి చేసిన మొదటి జన్యు మార్పిడి వరి రకాలు డీఆర్‌ దాన్‌ 100(కమలా) పూసా డిఎస్‌టి రైస్‌`1ను విడుదల చేసింది. కార్పొరేట్‌ లాబీల ఒత్తిడితోనే ప్రభుత్వం చట్ట విరుద్ధమైన పనులు చేయడం షాకింగ్‌గా ఉంది.

జన్యు సవరణ టెక్నికల్‌ సేఫ్‌ కావని సైంటిఫిక్‌ రిపోర్టులు చెబుతున్నాయి. అని కొలిషన్‌ ఒక స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ఈ జన్యు మార్పిడి వరి రకాలు భారత్‌లోని వైవిద్యమైన వరి జన్యు సమూహాలన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చని ఈగ్యువ హెచ్చరించింది. జన్యు మార్పిడి మంచిది కాదని తెలిపింది. ఒక జాతి డీఎన్‌ఏను మరొక దాంట్లోకి ప్రనవేశపెట్టి జన్యువులను ఉత్పరివర్తనం చెందిస్తారు. దీనినే జన్యు మార్పిడి అంటారు. అమెరికా ఉత్పత్తి చేసిన సోయాబీన్‌ నౌకను సముద్రంలో చాలా కాలం నిలిపివేసింది. భారత్‌ మన దేశం వ్యవసాయమే జీవనాధారం. 358 మిలియన్ల హెక్టార్లు సాగు భూమి నుంచి ఏటా 1,309 లక్షల టన్ను పంట దిగుబడి ఉత్పత్తి చేస్తుంది. జన్యు మార్పిడికి లోనైన జీవులు సహజ వాతావరణలో అనూహ్య విధాలుగా ప్రనతి స్పందించే అవకాశం ఉంది. జన్యు సవరణ వంటి సింథటిక్‌ బయాలజీ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికి ఉండే సమస్యలు దానిలో ఉన్నాయి. జీవుల జన్యు మార్పిడి చేయడంలో భద్రత నైతిక చిక్కులు ఇమిడి ఉన్నాయి. ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా సూరక్షితంగా ఉపయోగించుకోవాలి. అందుకే జాగ్రత్తగా నియంత్రణ పర్యవేక్ష అవసరం. అధిక ధర సంక్షిష్టత దీనికి ఉన్న పెద్ద ప్రతికూలత. ప్రత్యేకమైన పరికరాలు సుశిక్షతులైన సిబ్బంది అవసరం. దీని వల్ల చిన్న తరహా ప్రాజెక్టులను చేపట్టడం కష్టంగా మారుతుంది. ఊహించని పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది.

Leave a Reply

Cancel Reply

Your email address will not be published.

Related News

Follow US

VOTE FOR CHAMPION

vote-image

Who is the world cup winner of 2023

35%
11%
31%
17%
2%
4%
0%

Top Categories

Recent Comment

Please Accept Cookies for Better Performance