ఆరిలోవ ,న్యూస్ వన్ ప్రతినిధి : మహా విశాఖ జీవీఎంసీ 13వ వార్డులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ఆదేశాల మేరకు ఆదివారం లక్ష్మినగర్ వద్ద గల 549 రేషన్ డిపో ను వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణ గారు, వార్డు అధ్యక్షులు పోత్రకొండ ధర్మారావు మరియు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ డిపోలు తెరిచి ఉంటాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులుఅందిస్తారు.మరియు 65 ఏళ్లు పైబడిన వారికి దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటి వదనే రేషన్ పంపిణీ చేయమని నిర్ణయించటం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు కార్యదర్శి యల్లమిల్లి సురేష్ మహిళా అధ్యక్షురాలు మజ్జి.రమణి క్లస్టర్ ఇంచార్జ్ తురకపూడి బాలస్వామి బీసీ సెల్ అధ్యక్షులు ఒడిసెల శ్రీను బిజెపి నాయకులు కోటేశ్వరరావు సతీష్ జనసేన అధ్యక్షులు నీలి. పైడి రాజు సన్యాసిరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లని వరలక్ష్మి సంజీవరావు అడ్డూరి వెంకటరమణ కనకల శీను పైడ్రాజు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Cancel ReplyRelated News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
లోకల్ వార్తలు
15
-
ఆంద్రప్రదేశ్
15
-
జాతీయం
14
-
Uncategorized
13