పాలకొండ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9 కి వాయిదా పడిన నేపథ్యంలో దేశవ్యాప్త కార్మిక, కర్షక సంఘాలు చేపడుతున్న నిరసనలలో భాగంగా మంగళవారం పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దుర్గ గుడి సెంటర్ వరకు భారీ ర్యాలీ, మానవహారం .నిరసన చేపట్టారు!ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొస్తున్నారు.లేబర్ కోడ్ లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వీరి సమస్యలపై నిరసన తెలుపుకు నే అవకాశం కూడా కోల్పోతారని, ఇది ఒకరకంగా దేశంలో నిరంకుశ విధానాలను అవలంబించడ మేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9న సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. ఆ సమ్మె జయప్రదానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి .స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. పార్లమెంటులో మద్దతు ధరల చట్టం చేయాలి.ఉపాధి పనులు 200 రోజులు 600 రూపాయలు కూలి ఇవ్వాలని,పట్టణాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం కాంతారావు ,అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు బి అమరవేణి, బి పార్వతి ,ఏ దర్శమ్మి, ఆర్ భవాని వై మనీ మధ్యాహ్నం భోజనం కార్మిక సంఘం స్కూల్ శానిటేషన్ నాయకులు ఎన్ రో య్ భారీ, బి సునీత, పి రమాదేవి, డి చామంతి ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు కే గౌరీశ్వరి .ఆశ వర్కర్ నాయకులు శారద, శాంతి ,మహేశ్వరి ,లక్ష్మి. రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గేదెల సత్యం .శ్రీనివాసరావు .శ్రీ కోట దుర్గ మార్కెట్ కళాసి యూనియన్ జాగా గోవిందరావు ,డి గౌరీ శంకర్ ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిహెచ్ సంజీవి , భవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు మజ్జి వీరమనాయుడు ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు రైతు సంఘం సీనియర్ నాయకులు ఖండాపు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నా
Print News