Print News
బెంగళూరు : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సాహం కొన్ని గంటలకే ఆవిరైంది. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరపనుంది. నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ తొక్కిసలాట ఘటనపై 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అసహజ మరణాల కింద వాటిని పోలీసులు కేసు నమోదు చేశారు.
Leave a Reply
Cancel ReplyRelated News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
35%
11%
31%
17%
2%
4%
0%
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
లోకల్ వార్తలు
15
-
ఆంద్రప్రదేశ్
15
-
జాతీయం
14
-
Uncategorized
13