విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా 2018 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కేతన్ గార్గ్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కేతన్ గార్గ్ బదిలీతో ఖాళీ అయిన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్థానాన్ని తదుపరి ఉత్తరువులు ఇచ్చేవరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలతో అప్పగించారు. గతంలో జీవీఎంసీ కమిషనర్ గా విధులు నిర్వహించిన పి.సంపత్ కుమార్ 2025 జనవరి 20 బదిలీ కావడంతో అప్పటినుండి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంద్ర ప్రసాద్ జీవీఎంసీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు నెలల తర్వాత జీవీఎంసీ పూర్తిస్థాయి కమిషనర్ ను నియమించింది.
Leave a Reply
Cancel ReplyRelated News
Popular News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
లోకల్ వార్తలు
18
-
ఆంద్రప్రదేశ్
16
-
జాతీయం
15
-
Uncategorized
13