మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలంకు నివాళులు అర్పించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం
విశాఖ పశ్చిమం : విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం ఎన్ హెచ్ ఫంక్షన్ హాల్ (ఊర్వశి) లో కార్యవర్గం సమావేశంను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ సమావేవాసానికి .ముఖ్యఅతిథిగా మాజీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్ యాదవ్, ఆర్ఐ పల్లా మహేష్ యాదవ్ లు హాజరయ్యారు.బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు కిలాడి అప్పలరాజు యాదవ్ సభ అధ్యక్షత వహించారు.. ఈ సందర్భంగా ఇటీవల విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మరణం యాదవులకు తీరం లోటని విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అభిప్రాయపడింది.ముందుగా సంతాపదినం తెలుపుతూ నివాళులు అర్పించారు.అనంతరం మాజీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కార్మిక నాయకులు, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. యాదవ్ సామాజిక వర్గం కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు.గౌరవ సలహాదారులు నమ్మి అప్పలరాజు యాదవ్ మాట్లాడుతూ పల్లా సింహాచలం యాదవ్ సామజి క వర్గం కోసం కృషి చేసేవారని మన మధ్యన లేకపోవడం తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు నమ్మి అప్పలరాజు యాదవ్ గౌరవ సలహాదారులు సీరం రవి ( ఎన్ హెచ్ ఫంక్షన్ హాల్ అధినేత) ,కడియం అశోక రత్నం, సర్వసిద్ధి సాయి శ్రీధర్, వెంగళరాజు, అధ్యక్షులు నంబర సంతోష్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ యాదవ్, కోశాధికారి ఇసరపు చంద్రశేఖర్,మీడియా అడ్వైజర్ నక్కాన అజయ్ కుమార్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి సాయి లత, త్రినాధ్ యాదవ్,గుణశేఖర్ యాదవ్, నూనెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.